ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్..
- November 26, 2022ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫారమ్లో బ్లాక్ ఫ్రైడే సేల్ ను అమలు చేస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్లో భాగంగా.. కొనుగోలుదారులు ICICI బ్యాంక్ కార్డ్లు, కోటక్ బ్యాంక్ కార్డ్లు, సిటీ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి చేసిన స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై 12శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.
ఈ-టైలర్ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ను కూడా అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ పే లేటర్ కొనుగోలు ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్ సందర్భంగా మరికొన్ని స్మార్ట్ఫోన్ల డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 30 Ultra 5Gని Flipkart లో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 54,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 59,999కి లాంచ్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు Motorola నుంచి ఈ హ్యాండ్సెట్ (128GB స్టోరేజ్ వేరియంట్)పై కేవలం రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పనిచేస్తుంది. 200 MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్ను కలిగి ఉంది.
ఆపిల్ ఐఫోన్ 11 ( 64GB స్టోరేజీ) వేరియంట్ రూ. 43,900కి బదులుగా రూ. 39,999 ధరకు అందుబాటులో ఉంది. రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను అందిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది.
వివో V25 ప్రో 5G ( 8GB RAM + 128GB ROM) వేరియంట్ రూ. 39,999కి బదులుగా రూ. 35,999 తగ్గింపు ధరతో లిస్టు అయింది. ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 6.56-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. 4,830mAh బ్యాటరీని కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా వెనుక సెటప్తో వస్తుంది.
రియల్మి GT Neo 3T (128 GB ROM, 8 GB RAM) వేరియంట్ రూ.36,999కి బదులుగా రూ. 31,999 వద్ద లిస్టు అయింది.ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో వస్తుంది.ఈ స్మార్ట్ఫోన్ 6.62-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా వెనుక సెటప్తో వస్తుంది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు