$5 మిలియన్ లాండరింగ్: బహ్రెయిన్లో అరబ్ మహిళపై విచారణ
- November 27, 2022
బహ్రెయిన్: జీసీసీ దేశంలో మనీలాండరింగ్ ఆరోపణలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఇద్దరు అరబ్ జాతీయులు బహ్రెయిన్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ జంట సుమారు $5 మిలియన్లను లాండరింగ్ చేసి, బహ్రెయిన్లో వివిధ లాభదాయకమైన ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు కేసు ఫైల్స్ చెబుతున్నాయి. బహ్రెయిన్ హైకోర్టు ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. మొదటి ముద్దాయి గల్ఫ్లో నివసిస్తున్న 39 ఏళ్ల పారిపోయిన మహిళ అని కేసు ఫైల్స్ చెబుతున్నాయి. దుర్వినియోగమైన నిధుల నుండి $5 మిలియన్లను బదిలీ చేసినందుకు బహ్రెయిన్లో బ్యాంక్ ఖాతాను తెరిచినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమెపై అభియోగాలు మోపింది. రెండవ ముద్దాయి 48 ఏళ్ల అరబ్ పెట్టుబడిదారుడు. ఆ మహిళ కోసం BD 1.8 మిలియన్లకు, అంవాజ్ దీవులలో మరొకటి BD 950,000కి, BD347,000కి జుఫైర్లో ఒక భూమి, విల్లాకు రియల్ ఎస్టేట్ ఆస్తిని కొనుగోలు చేసి ఇచ్చాడు. ఆ మహిళ ఇతర కొనుగోళ్లు చేసి తన స్వదేశంలో ఉన్న తన తండ్రి ఖాతాకు డబ్బును బదిలీ చేసిందని, ఆమె ఖాతాలో BD 90,000 మిగిలి ఉందని విచారణ అధికారులు గుర్తించారు. నిధులు చట్టవిరుద్ధంగా వచ్చినవని తెలిసినా మహిళకు సదరు వ్యక్తి ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు విచారణాధికారులు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









