$5 మిలియన్ లాండరింగ్: బహ్రెయిన్లో అరబ్ మహిళపై విచారణ
- November 27, 2022
బహ్రెయిన్: జీసీసీ దేశంలో మనీలాండరింగ్ ఆరోపణలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఇద్దరు అరబ్ జాతీయులు బహ్రెయిన్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ జంట సుమారు $5 మిలియన్లను లాండరింగ్ చేసి, బహ్రెయిన్లో వివిధ లాభదాయకమైన ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు కేసు ఫైల్స్ చెబుతున్నాయి. బహ్రెయిన్ హైకోర్టు ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. మొదటి ముద్దాయి గల్ఫ్లో నివసిస్తున్న 39 ఏళ్ల పారిపోయిన మహిళ అని కేసు ఫైల్స్ చెబుతున్నాయి. దుర్వినియోగమైన నిధుల నుండి $5 మిలియన్లను బదిలీ చేసినందుకు బహ్రెయిన్లో బ్యాంక్ ఖాతాను తెరిచినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమెపై అభియోగాలు మోపింది. రెండవ ముద్దాయి 48 ఏళ్ల అరబ్ పెట్టుబడిదారుడు. ఆ మహిళ కోసం BD 1.8 మిలియన్లకు, అంవాజ్ దీవులలో మరొకటి BD 950,000కి, BD347,000కి జుఫైర్లో ఒక భూమి, విల్లాకు రియల్ ఎస్టేట్ ఆస్తిని కొనుగోలు చేసి ఇచ్చాడు. ఆ మహిళ ఇతర కొనుగోళ్లు చేసి తన స్వదేశంలో ఉన్న తన తండ్రి ఖాతాకు డబ్బును బదిలీ చేసిందని, ఆమె ఖాతాలో BD 90,000 మిగిలి ఉందని విచారణ అధికారులు గుర్తించారు. నిధులు చట్టవిరుద్ధంగా వచ్చినవని తెలిసినా మహిళకు సదరు వ్యక్తి ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు విచారణాధికారులు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







