ఫిఫా ప్రపంచకప్: ముగిసిన సౌదీ అరేబియా ప్రయాణం

- December 01, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచకప్: ముగిసిన సౌదీ అరేబియా ప్రయాణం

దోహా: దోహాలోని లుసైల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల మూడో రౌండ్‌లో మెక్సికోతో 1-2 తేడాతో ఓడిపోవడంతో సౌదీ అరేబియా నాకౌట్ 16లో ప్రవేశించాలనే 28 ఏళ్ల కల చెదిరింది.  గ్రీన్ ఫాల్కన్‌లు తమ మొదటి మ్యాచ్ లో అర్జెంటీనాను 2–1 పై చారిత్రాత్మక విజయం సాధించి అభిమానుల్లో ఆశలు పెంచారు. కానీ ఆ తర్వాత పోలాండ్, మెక్సికో చేతిలో ఓడిపోయి గ్రూప్‌లో చివరి స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.

ప్రపంచ కప్‌లో ఆరుసార్లు పాల్గొన్న సౌదీ జట్టు 1994లో టోర్నమెంట్‌లో ఒక్కసారి మాత్రమే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. ఆరు పాయింట్లతో అర్జెంటినా గ్రూప్ లో టాప్ లో ఉన్నది.  అర్జెంటీనా చేతిలో 2-0 తేడాతో ఓడిపోయిన పోలాండ్ రెండో స్థానంలో.. నాలుగు పాయింట్లతో మెక్సికో మూడో స్థానంలో..  సౌదీ అరేబియా 3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com