67 కొత్త చారిత్రక ప్రదేశాలను నమోదు చేసిన సౌదీ హెరిటేజ్ కమిషన్
- December 05, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని 67 కొత్త పురావస్తు ప్రదేశాలను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీలో డాక్యుమెంట్ చేయడానికి, నమోదు చేయడానికి హెరిటేజ్ కమిషన్ ఆమోదం తెలిపింది. కొత్త 67 పురావస్తు ప్రదేశాలలో అనేక పురావస్తు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని 8,531 పురావస్తు ప్రదేశాలు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీలో నమోదు చేయబడ్డాయి. ఉత్తర సరిహద్దు ప్రాంతం 15 ప్రదేశాలతో అత్యధిక సంఖ్యలో పురావస్తు ప్రదేశాలను కలిగి ఉంది. ఆ తర్వాత 13 సైట్లతో తబుక్ ప్రాంతం, 10 సైట్లతో హేల్, 9 సైట్తో అల్-జౌఫ్, 5 సైట్తో అల్-ఖాసిమ్, రియాద్ , అసీర్ 4 సైట్లతో, మదీనా, అల్-బహా 3 ప్రదేశాలతో, మక్కా 1 పురావస్తు ప్రదేశంతో జాబితాలో ఉన్నాయి.
సౌదీ అరేబియాలోని పురావస్తు, చారిత్రక ప్రదేశాలను కనుగొనడంలో హెరిటేజ్ కమిషన్ పని చేస్తోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ యాంటిక్విటీస్లో అధికారికంగా నమోదు చేస్తుంది. నమోదు తర్వాత కమిషన్ సైట్లను డిజిటల్ మ్యాప్లలో జోడిస్తుంది. ఆ తర్వాత నమోదిత పురావస్తు ప్రదేశాల ప్రాదేశిక డేటాబేస్ను తయారు చేస్తుంది. వారసత్వ ప్రదేశాల పత్రాలు, చిత్రాలను ఆర్కైవ్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









