తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు: ఒమన్
- December 07, 2022
మస్కట్: తమ ఉత్పత్తులు వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని కంపెనీలు ప్రకటనల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాయి. కొంతమంది ప్రకటనలు చెప్పేవి అతిశయోక్తిగా ఉంటాయి. తప్పుదారి పట్టించే విధంగా ఆ ప్రకటనలు ఉంటాయి. ఇలా వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా ఉండే ప్రకటనలపై చర్యలు తీసుకుంటామని వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA)లోని కమర్షియల్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అల్ ఫదేల్ బిన్ నసీర్ అల్ యహ్మదీ హెచ్చరించారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న లేదా కేవలం తప్పుడు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు వినియోగదారులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్య ఉత్పత్తుల కోసం ప్రకటనల విషయంలో ఇలా తప్పుడు ప్రకటనలు ఎక్కువ నష్టం చేస్తాయన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలను ఎదుర్కోవడానికి, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఇతర సంబంధిత విభాగాలతో సన్నిహిత సహకారంతో పని చేస్తోందని అల్ యహ్మదీ చెప్పారు. 2022 సంవత్సరంలో తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన దాదాపు 600 క్లెయిమ్స్, ఫిర్యాదులు అందాయని, 2021లో 610 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
తాజా వార్తలు
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక









