ప్రపంచ పర్యాటక వ్యయం: Dhs108 బిలియన్ తో దుబాయ్ అగ్రస్థానం
- December 07, 2022
దుబాయ్: వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTCC) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2022లో అంతర్జాతీయ పర్యాటక వ్యయం $29.4 బిలియన్లకు (Dhs108 బిలియన్) చేరుకోవడంతో దుబాయ్ ప్రపంచంలోనే ట్రావెల్, టూరిజంలో నంబర్ వన్ గమ్యస్థానంగా తన స్థానాన్ని నిలుపుకుంది. దోహా, లండన్లను అధిగమించిందని, పర్యాటకులు ఈ రెండు నగరాల్లో వరుసగా $16.8 బిలియన్లు, $16.1 బిలియన్లు వెచ్చించారని నివేదిక తెలిపింది.
"వీసా" కంపెనీ సహకారంతో విడుదల చేసిన నివేదిక.. ప్రపంచ పర్యాటక పరంగా నగరాలు శక్తి కేంద్రాలుగా కొనసాగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగం, ఆర్థిక వ్యవస్థలలో పునరుద్ధరణకు దారితీస్తుందనే నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ సందర్శకుల వ్యయం పరంగా అత్యధిక పునరుద్ధరణను సాధించిన నగరాల్లో దోహా 21% టాప్ ఉన్నది. ఆ తర్వాత ఓర్లాండో 19%, అంటాల్య 15% పెరుగుదలతో ఉన్నాయి.
రాబోయే దశాబ్ద కాలంలో పర్యాటక రంగం మరోసారి ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందన్నారు. ఇది 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నివేదిక పేర్కొంది. 2019లో 6.6%, 2020లో 5.1% ఉన్న నగరాల నివేదికలో విశ్లేషించబడిన 82 నగరాల్లోని మొత్తం ఉద్యోగాలలో 8% వరకు ఈ రంగం నేరుగా అందిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









