అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన యూఏఈ..
- December 12, 2022యూఏఈ: అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ రోవర్ రషీద్ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించింది. ఇది 385,000 కి.మీ దూరం ప్రయాణించనున్నది. లూనార్ రోవర్ రషీద్ ప్రయోగం అరబ్ ప్రపంచంలో మొదటిది కాగా.. రోవర్ విజయవంతంగా చంద్రునిపై దిగితే.. చంద్రునికపై కాలుమోపిన నాల్గవ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టిస్తుంది.
రషీద్ రోవర్ లాంచ్ కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.38 గంటలకు (యూఏఈ సమయం) ప్రయోగం జరిగింది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ సెప్టెంబరు 2020లో మొదటిసారిగా ప్రకటించింది. ఇప్పటివరకు టెక్నికల్ సమస్యలతో ప్రయోగాన్ని నాలుగు సార్లు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?