కోల్‌కతాకు విమానాలను పునఃప్రారంభించనున్న ఎతిహాద్ ఎయిర్‌వేస్

- December 16, 2022 , by Maagulf
కోల్‌కతాకు విమానాలను పునఃప్రారంభించనున్న ఎతిహాద్ ఎయిర్‌వేస్

యూఏఈ: యూఏఈ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ మార్చి 26, 2023 నుండి భారతదేశంలోని కోల్‌కతాకు విమానాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అబుధాబి - కోల్‌కతా మార్గంలో ప్రతిరోజూ నడుపనున్నట్లు తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (CCU) మొత్తం ఏడు వారపు నాన్‌స్టాప్ సర్వీసులను నడుపనున్నది. ఎయిర్‌బస్ A320 ఎయిర్‌క్రాఫ్ట్‌ బిజినెస్ క్లాస్‌లో ఎనిమిది సీట్లలో, ఎకానమీలో 150 సీట్లలో ఎతిహాద్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లోని గ్లోబల్ సేల్స్ & కార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ డ్రూ వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com