ISB ద్విదశాబ్ది వేడుకలకు ముఖ్య అతిధిగా రాబోతున్న చంద్రబాబు
- December 16, 2022
హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ద్విదశాబ్ది వేడుకలు ఈరోజు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు.
1999లో ఐఎస్బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకల అనంతరం చంద్రబాబు..స్టూడెంట్స్ తో ముఖాముఖీ నిర్వహించబోతున్నారు.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







