మలేషియాలో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది మృతి
- December 16, 2022
కౌలాలంపూర్: మలేషియాలోని క్యాంప్సైట్లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో 92 మంది కొండచరియల కింద చిక్కుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి 53మందిని మందిని క్షేమంగా బయటకు తీశారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో స్థానికుల ఆచూకీ లభించలేదు. వారికోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని సెలంగోర్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్ మెంట్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషాధ ఘటనపై రెస్క్యూ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కొండచరియలు క్యాంప్ సైట్ నుండి 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తు నుంచి పడిపోయాయని, ఈ కొండచరియలు సుమారు ఎకరం ప్రదేశాన్ని చుట్టుముట్టాయని తెలిపారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి శరీరాలు కొండచరియల కింద పడి ఛిన్నాభిన్నం అయ్యాయి. గల్లంతైన వారికోసం విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. అయితే, వీరిలో కొందరు మరణించికూడా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని కాపాడే ప్రయత్నాల్లో రెస్క్యూ టీం సిబ్బంది నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







