టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట
- December 16, 2022
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శుక్రవారం (డిసెంబర్ 16,2022) దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. తీర్పును సస్పెండ్ చేసింది. ఈవో ధర్మారావుకు సింగిల్ బెంచ్ నెల రోజులు జైలుశిక్ష,రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను డివిజినల్ సస్పెండ్ చేసింది.
కాగా కొన్నాళ్ల క్రితం టీటీడీకి చెందిన ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు సర్వీస్ క్రమబద్దీకరణ విషయంలో తమకు న్యాయం చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సదరు ఉద్యోగులను క్రమబద్దీకించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో సింగిల్ బెంచ్ ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కింద నెల రోజులు జైలు..రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దర్మారెడ్డి పిటీషన్ వేయగా డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధర్మారెడ్డికి ఊరట కలిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







