ఏపీలో 28 రూట్లలో విమాన సర్వీసులు..
- December 16, 2022
న్యూ ఢిల్లీ: ఉడాన్ స్కీమ్ కింద విమానాలు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, ప్రకాశం బ్యారేజీ వాటర్ ఏరోడ్రోమ్లను గుర్తించామని కేంద్రం తెలిపింది.
కడప, కర్నూలు నుంచి ఇప్పటికే ఉడాన్ విమానాల రాకపోకలు సాగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనురాధ, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రకాశం బ్యారేజీ ఏరోడ్రోమ్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని అన్నారు. అక్కడ ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉడాన్ పథకం కింద మొత్తం 28 రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. ఉడాన్ అనేది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, సమయానుకూలంగా బిడ్డింగ్ రౌండ్లు నిర్వహించి, కొత్త విమాశ్రయాలు, కొత్త రూట్లను చేర్చడం జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









