TTD బోర్డు సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్
- December 16, 2022
అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్మ తో ‘వ్యూహం’ మూవీని నిర్మిస్తున్న నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు కీలక పదవి అప్పగించారు జగన్. TTD బోర్డు సభ్యుడిగా.. కిరణ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులో ఇప్పటికే 23 మంది సభ్యులు ఉన్నారు. కిరణ్ ఎంట్రీతో అది 24కు చేరనుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యిన దగ్గరి నుండి అంత వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ మధ్యనే వర్మ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్తో భేటీ తర్వాత రెండు సినిమాలు వర్మ ప్రకటించారు. మొదటి సినిమా పేరు వ్యూహం కాగా.. రెండో సినిమా పేరు శపధం అని ప్రకటించారు. ఈ సినిమాలకి దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. దాసరి కిరణ్ కుమార్ను టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక టీటీడీ బోర్డు సభ్యుడిగా కిరణ్ నియామకంఫై వర్మ ట్వీట్ చేసాడు. తాను తీసే వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అని.. ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్య మంత్రి @ysjagan గారి చేత టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికకాబడ్డ నా “వ్యూహం” ప్రొడ్యూసర్ @dkkzoomin గారికి అతి పెద్ద కంగ్రాట్స్💐💐💐💐💐 pic.twitter.com/dRmgcnynzM
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









