TTD బోర్డు సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్
- December 16, 2022
అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్మ తో ‘వ్యూహం’ మూవీని నిర్మిస్తున్న నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు కీలక పదవి అప్పగించారు జగన్. TTD బోర్డు సభ్యుడిగా.. కిరణ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులో ఇప్పటికే 23 మంది సభ్యులు ఉన్నారు. కిరణ్ ఎంట్రీతో అది 24కు చేరనుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యిన దగ్గరి నుండి అంత వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ మధ్యనే వర్మ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్తో భేటీ తర్వాత రెండు సినిమాలు వర్మ ప్రకటించారు. మొదటి సినిమా పేరు వ్యూహం కాగా.. రెండో సినిమా పేరు శపధం అని ప్రకటించారు. ఈ సినిమాలకి దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. దాసరి కిరణ్ కుమార్ను టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక టీటీడీ బోర్డు సభ్యుడిగా కిరణ్ నియామకంఫై వర్మ ట్వీట్ చేసాడు. తాను తీసే వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అని.. ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్య మంత్రి @ysjagan గారి చేత టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికకాబడ్డ నా “వ్యూహం” ప్రొడ్యూసర్ @dkkzoomin గారికి అతి పెద్ద కంగ్రాట్స్💐💐💐💐💐 pic.twitter.com/dRmgcnynzM
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







