కువైట్ లో ప్రవాస రోగులపై ‘మెడిసిన్ ఫీ’ అమలు
- December 19, 2022
కువైట్: దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, మెడిసిన్స్ వృధా చేయడాన్ని ఆపడానికి ప్రవాస రోగుల నుండి మందుల పంపిణీకి రుసుము వసూలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్ క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలోని ఫార్మసీలకు మెడిసిన్ ఫీజులో KD 5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్ క్లినిక్లలో అందించే మందులకు KD10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య సంప్రదింపు రుసుములకు అదనం. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలో వైద్య పరీక్షల కోసం KD2 రుసుముగా నిర్ణయించారు. అయితే ఔట్ పేషెంట్ క్లినిక్లకు KD10 గా ఫీజును వసూలు చేయనున్నారు. కొత్త మెడిసిన్ ఫీ ఉత్తర్వులు డిసెంబర్ 18 నుండి అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







