కువైట్ లో ప్రవాస రోగులపై ‘మెడిసిన్ ఫీ’ అమలు
- December 19, 2022
కువైట్: దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, మెడిసిన్స్ వృధా చేయడాన్ని ఆపడానికి ప్రవాస రోగుల నుండి మందుల పంపిణీకి రుసుము వసూలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్ క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలోని ఫార్మసీలకు మెడిసిన్ ఫీజులో KD 5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్ క్లినిక్లలో అందించే మందులకు KD10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య సంప్రదింపు రుసుములకు అదనం. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలో వైద్య పరీక్షల కోసం KD2 రుసుముగా నిర్ణయించారు. అయితే ఔట్ పేషెంట్ క్లినిక్లకు KD10 గా ఫీజును వసూలు చేయనున్నారు. కొత్త మెడిసిన్ ఫీ ఉత్తర్వులు డిసెంబర్ 18 నుండి అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







