కువైట్ లో ప్రవాస రోగులపై ‘మెడిసిన్ ఫీ’ అమలు
- December 19, 2022
కువైట్: దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, మెడిసిన్స్ వృధా చేయడాన్ని ఆపడానికి ప్రవాస రోగుల నుండి మందుల పంపిణీకి రుసుము వసూలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్ క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలోని ఫార్మసీలకు మెడిసిన్ ఫీజులో KD 5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్ క్లినిక్లలో అందించే మందులకు KD10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య సంప్రదింపు రుసుములకు అదనం. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్లలో వైద్య పరీక్షల కోసం KD2 రుసుముగా నిర్ణయించారు. అయితే ఔట్ పేషెంట్ క్లినిక్లకు KD10 గా ఫీజును వసూలు చేయనున్నారు. కొత్త మెడిసిన్ ఫీ ఉత్తర్వులు డిసెంబర్ 18 నుండి అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









