కోవిడ్ నిబంధనలు పాటించకపోతే యాత్రను ఆపేయండి: కేంద్రం

- December 21, 2022 , by Maagulf
కోవిడ్ నిబంధనలు పాటించకపోతే యాత్రను ఆపేయండి: కేంద్రం

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​ లో కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కు కూడా పంపింది.

కాగా, రాహుల్​ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. ‘‘బహుశా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలాంటి లేఖను విడుదల చేశారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు”అని వ్యాఖ్యానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com