రిలయన్స్ చేతికి మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా
- December 22, 2022
ముంబై: మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా బిజినెస్ను రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకుంది.ఈ మేరకు మెట్రో క్యాష్ & క్యారీ ఇండియాలో వందశాతం వాటాల టేకోవర్ కోసం కుదిరిన ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ సంతకం చేసింది. రూ.2,850 కోట్లకు మెట్రో క్యాష్ అండ్ క్యారీని రిలయన్స్ సొంతం చేసుకుంది.దీంతో మెట్రో ఇండియా నెట్వర్క్ మొత్తం రిలయన్స్ పరం అవుతాయి. మెట్రోకు దేశంలోని ప్రధాన నగరాల పరిధిలో రిజిస్టర్డ్ కిరాణా స్టోర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ, ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వశాఖల ఆమోదం లభించిన తర్వాత వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు.
2003లో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ ఫార్మాట్లో మెట్రో ఇండియా సేవలు ప్రారంభించింది. దేశంలోని 21 నగరాల పరిధిలో 31 అతిపెద్ద స్టోర్స్ నిర్వహిస్తున్నది.ఇందులో సుమారు 3,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సెప్టెంబర్తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి మెట్రో ఇండియా సేల్స్ రూ.7,700 కోట్లకు చేరుకున్నాయని రిలయన్స్ రిటైల్ తెలిపింది.
తాజా వార్తలు
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..







