ఒమన్లో పిల్లలపై వేధింపులు.. పెరుగుతున్న కేసులు
- December 23, 2022
మస్కట్: ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) ప్రకారం.. గత మూడేళ్లలో 77 మంది పిల్లలు వేధింపులు, నిర్లక్ష్యం కారణంగా మరణించారు. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలో మహిళా వ్యవహారాల నిపుణుడు, OHRC వద్ద పర్యవేక్షణ, రిసీవింగ్ నివేదికల కమిటీ చైర్పర్సన్ లబిబెహ్ బింట్ మొహమ్మద్ అల్ మవాలీ మాట్లాడుతూ.. పిల్లలపై నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులు 77కి పైగా పెరిగాయని చెప్పారు. లోయలు, ఈత కొలనులలో మునిగిపోవడం, బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మతిమరుపు వంటి కేసులతో సహా అనేక కారణాలతో నమోదైన కేసులు ఇందులో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం బాలల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కమిటీ అనేక నివేదికలతో వ్యవహరించిందని, సంబంధిత అధికారులు, పౌర సమాజ సంస్థల సహకారంతో పర్యవేక్షించినట్లు అల్ మవాలీ పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితిని నేరుగా అసెస్ మెంట్ చేయడం ద్వారా పాల్గొన్న కుటుంబాలకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు కమిటీచే తీసుకోబడ్డాయని గుర్తు చేశారు. ఈ సంవత్సరం, వికలాంగ పిల్లలకు సంబంధించి కమిటీ అనేక నివేదికలను అందుకుందని, ఈ సమూహానికి విద్యా, పునరావాస సేవలకు హామీ ఇచ్చే విధంగా నివేదికలు సిఫార్సు చేశాయని పేర్కొన్నారు. వికలాంగుల హక్కులపై అవగాహన పెంచేందుకు, అలాగే సమాజంలో వారిని భాగస్వామ్యులను చేసే విధానాల గురించి పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగిందన్నారు. OHRC, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖతో సహకారం, సమన్వయంతో, ఒమానీ మహిళా సంఘాల భాగస్వామ్యంతో, ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో పిల్లల పట్ల నిర్లక్ష్యం, దుర్వినియోగాన్ని తగ్గించడానికి కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉందని అల్ మవాలీ సూచించారు. ఈ వారం, ముసండం గవర్నరేట్లోని ఖాసబ్, బుఖా, దిబ్బ విలాయత్లలో ఈ కార్యక్రమం అమలు చేయబడిందన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







