సైబరాబాద్ క్రైమ్ రిపోర్ట్ – 2022ను వెల్లడించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
- December 23, 2022
హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది 12శాతం వరకు ఉన్నట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే నేరాలు తగ్గాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ జరిగినప్పటికీ.. సైబరాబాద్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు మూడు సార్లు ప్రధాని పర్యటన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. సైబరాబాద్ పోలీసులు సమర్థంగా పని చేసి, ఎక్కడా సమస్యలు రానివ్వలేదన్నారు. కమిషనరేట్ పరిధిలో లో అన్ని పండుగలు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగాయని చెప్పారు. 2010 నుంచి పెండింగ్ లో ఉన్న 80 శాతం కేసుల దర్యాప్తు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 27,322 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని వివరించారు.
57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది పై రౌడీషీట్ ఓపెన్ చేశాం. సైబరాబాద్ డయల్ 100 కు ఈ ఏడాది 2 లక్షల 36 వేల 417 కాల్స్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 49% కాల్స్ పెరిగాయి. ఈ ఏడాది 93 హత్య కేసులు, 316 లైంగిక దాడి కేసులు జరిగాయి. మహిళలపై నేరాల అంశంలో 2,166 కేసులు వచ్చాయి. 15 వరకట్నం హత్య కేసులు వచ్చాయి. 1,096 వరకట్నపు వేధింపుల కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య ఎనిమిది శాతం తగ్గింది. 328 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







