బహ్రెయిన్ ఆటం ఫెయిర్ 2022 ప్రారంభం
- December 23, 2022
మనామా: ముప్పై మూడవ ఎడిషన్ ఆటం ఫెయిర్ 2022ను పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ ప్రారంభించారు. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ నాసర్ అలీ అల్ ఖైదీతో కలిసి సఖిర్లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ (EWB)లో జరుగుతున్న ఎక్స్పోలో అల్ సైరాఫీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో పర్యాటక వ్యూహం (2022-2026) లక్ష్యాలకు అనుగుణంగా, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రయోజనం చేకూర్చే ఎగ్జిబిషన్ పరిశ్రమ బహ్రెయిన్ అద్భుతమైన పునరుద్ధరణను తెలియజేసే ఆటం ఫెయిర్ తిరిగి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం ఎడిషన్ 14 దేశాల నుండి 650 మంది ప్రదర్శనకారులు పాల్గొంటున్నారని తెలిపారు. బహ్రెయిన్ రాజ్యంతోపాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ రాష్ట్రం, ఒమన్ సుల్తానేట్, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, రిపబ్లిక్ ఆఫ్ యెమెన్, రాష్ట్రం పాలస్తీనా, రిపబ్లిక్ ఆఫ్ సూడాన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ, థాయ్లాండ్ రాజ్యం, రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ లనుంచి ప్రదర్శనకారులు హాజరవుతున్నారని వివరించారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







