బంగారు హారాన్ని దొంగిలించిన పనిమనిషికి జైలు, జరిమానా

- December 27, 2022 , by Maagulf
బంగారు హారాన్ని దొంగిలించిన పనిమనిషికి జైలు, జరిమానా

దుబాయ్: యజమాని ఇంట్లో బంగారు హారాన్ని దొంగిలించిన మహిళకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వృద్ధ మహిళ, పిల్లల సంరక్షణ కోసం పనిమనిషి కావాలని ఆన్‌లైన్ జాబ్ పోస్ట్‌ను చూసి జాయిన్ అయిన ఒక ఆసియా మహిళ.. అదును చూసి దొంగతనానికి పాల్పడిందని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష, 20,000 దిర్హామ్ జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. గత జూన్‌లో ఈ కేసు నమోదైంది. దొంగతనం జరిగిన 14 రోజుల తర్వాత పనిమనిషి కనిపించకుండా పోయిందని ఇంటి యజమాని తెలిపారు. పనిమనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com