భారత్ లో కరోనా విజృంభించే ముప్పు..
- December 28, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో జనవరిలో కరోనా విజృంభించే ముప్పు ఉందని, తదుపరి 40 రోజులు చాలా కీలకమని ఓ అధికారి జాతీయ మీడియాకు చెప్పారు. చైనా, జపాన్ తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత గణాంకాలను బట్టి చూస్తే భారత్ లోనూ కరోనా వ్యాప్తి చెందవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
గతంలో తూర్పు ఆసియాలో కరోనా విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్ లోనూ ఆ వైరస్ వ్యాప్తి చెందిందని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఓ అధికారి చెప్పారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు స్పందిస్తూ… దేశంలో కరోనా విజృంభించినప్పటికీ, ఇన్ఫెక్షన్ తీవ్రత, మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు.
చైనా, దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన అన్ని చర్యలపై సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ కూడా ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. జనవరిలో దేశంలో కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 బాగా వ్యాప్తి చెందుతోంది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







