భారత్ లో కరోనా విజృంభించే ముప్పు..
- December 28, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో జనవరిలో కరోనా విజృంభించే ముప్పు ఉందని, తదుపరి 40 రోజులు చాలా కీలకమని ఓ అధికారి జాతీయ మీడియాకు చెప్పారు. చైనా, జపాన్ తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే కరోనా మళ్ళీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత గణాంకాలను బట్టి చూస్తే భారత్ లోనూ కరోనా వ్యాప్తి చెందవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
గతంలో తూర్పు ఆసియాలో కరోనా విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్ లోనూ ఆ వైరస్ వ్యాప్తి చెందిందని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఓ అధికారి చెప్పారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు స్పందిస్తూ… దేశంలో కరోనా విజృంభించినప్పటికీ, ఇన్ఫెక్షన్ తీవ్రత, మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు.
చైనా, దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన అన్ని చర్యలపై సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ కూడా ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. జనవరిలో దేశంలో కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 బాగా వ్యాప్తి చెందుతోంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







