రాహుల్ కి భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు
- December 30, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీసులు పలు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇవాళ దాదాపు గంటన్నర పాటు ఢిల్లీ పోలీసు అధికారులు సమావేశమై రాహుల్ కు భద్రతపై చర్చించారు.
ఈ సమావేశంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి, రాహుల్ కు చెందిన ఇతర ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు పలు వివరాలు తెలిపారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఆయన చుట్టూ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక స్వాడ్ ను నియమిస్తున్నట్లు చెప్పారు. శక్తిమంతమైన రక్షణ వలయంగా వారు ఉంటారని, అందులోకి అనధికార వ్యక్తులు ఎవరినీ రాణించబోరని తెలిపారు.
కాగా, డిసెంబరు 24న నిర్వహించిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, ఢిల్లీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అమిత్ షాకు కూడా లేఖ రాసింది. అయితే, రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని కేంద్ర రిజర్వు పోలీసు దళం (CRPF) పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!