రాహుల్ కి భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు
- December 30, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీసులు పలు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇవాళ దాదాపు గంటన్నర పాటు ఢిల్లీ పోలీసు అధికారులు సమావేశమై రాహుల్ కు భద్రతపై చర్చించారు.
ఈ సమావేశంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి, రాహుల్ కు చెందిన ఇతర ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు పలు వివరాలు తెలిపారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఆయన చుట్టూ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక స్వాడ్ ను నియమిస్తున్నట్లు చెప్పారు. శక్తిమంతమైన రక్షణ వలయంగా వారు ఉంటారని, అందులోకి అనధికార వ్యక్తులు ఎవరినీ రాణించబోరని తెలిపారు.
కాగా, డిసెంబరు 24న నిర్వహించిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, ఢిల్లీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అమిత్ షాకు కూడా లేఖ రాసింది. అయితే, రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని కేంద్ర రిజర్వు పోలీసు దళం (CRPF) పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







