రైతుల మార్కెట్ను సందర్శించిన 60,000 మంది
- January 02, 2023
బహ్రెయిన్: డిసెంబర్ 10న ప్రారంభమైన బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు సందర్శకులు పోటెత్తారు.నాలుగు వారాల్లో సుమారు 60,000కుపైగా ప్రజలు, నివాసితులు, పర్యాటకులు సందర్శించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (NIAD) భాగస్వామ్యంతో మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మార్కెట్ని నిర్వహిస్తుంది.ఈ సంవత్సరం ఎడిషన్లో బహ్రెయిన్ రైతులు, వ్యవసాయ కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతోపాటు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం మార్కెట్ను మరింత పెంచడానికి దోహదపడ్డాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత బహ్రెయిన్ రైతు మార్కెట్ తిరిగి ఊపందుకోవడంపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహ్రెయిన్ రైతుల మార్కెట్ ప్రతి శనివారం బుదయ్య బొటానికల్ గార్డెన్లో ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







