స్పీకర్ అహ్మద్ తో సమావేశమైన భారత రాయబారి పీయూష్

- January 06, 2023 , by Maagulf
స్పీకర్ అహ్మద్ తో సమావేశమైన భారత రాయబారి పీయూష్

మనామా: కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లంతో బహ్రెయిన్ రాజ్యంలో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అహ్మద్ మాట్లాడుతూ..  రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో శాశ్వత వృద్ధిని ప్రశంసించారు. ఆసియా ఖండం అభివృద్ధిలో భారతదేశం పోషించిన కీలక పాత్రను కొనియాడారు. భారతదేశం-గల్ఫ్‌ మధ్య దృఢమైన సంబంధాలను, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి ఆసక్తిని వ్యక్త పరిచారు.  ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేయడంలో ప్రతినిధుల మండలి పాత్రను కొనియాడుతూ బహ్రెయిన్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు పరస్పర ఆసక్తిని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com