సంక్రాంతి సెలవులను మరోసారి మార్చిన ఏపీ ప్రభుత్వం
- January 07, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరోసారి సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. ఇక ఇప్పుడు ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేసింది. తెలంగాణ లో 13 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా..ఏపీ సర్కార్ 12 నుండి 17 వరకు సెలవులను ప్రకటించింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించింది. కానీ ఇప్పుడు సెలవుల్లో మార్పు చేసింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









