బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
- January 07, 2023
అమరావతి: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక కోసం నిన్న హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు కు చేరుకున్నారు. రాత్రి ప్రీ రిలీజ్ వేడుక అనంతరం బాలయ్య ఒంగోలు లోనే బస చేసారు. ఈరోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్ కు హీరోయిన్ శృతి హాసన్ , డైరెక్టర్ బి గోపాల్ తో పాటు ఆయన అదే హెలికాప్టర్ లో బయలుదేరారు.
బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులోని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక విమాన మార్గం ద్వారా నందమూరి బాలయ్య.. హైదరాబాద్ వస్తున్నారని టాక్. ఇక వీరసింహ రెడ్డి విషయానికి వస్తే..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







