బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
- January 07, 2023
అమరావతి: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక కోసం నిన్న హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు కు చేరుకున్నారు. రాత్రి ప్రీ రిలీజ్ వేడుక అనంతరం బాలయ్య ఒంగోలు లోనే బస చేసారు. ఈరోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్ కు హీరోయిన్ శృతి హాసన్ , డైరెక్టర్ బి గోపాల్ తో పాటు ఆయన అదే హెలికాప్టర్ లో బయలుదేరారు.
బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులోని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక విమాన మార్గం ద్వారా నందమూరి బాలయ్య.. హైదరాబాద్ వస్తున్నారని టాక్. ఇక వీరసింహ రెడ్డి విషయానికి వస్తే..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







