‘వీరయ్య’ - ‘వీర సింహారెడ్డి’లకు టికెట్ల ధరలు పెంపు.!
- January 11, 2023
ఈ మధ్య టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, సినిమా రిలీజ్ డేట్లు, అప్డేట్లతో పాటూ, మా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచడం లేదహో.. అని కూడా డప్పు కొట్టి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి.
అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు పెద్ద సినిమాలు ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ల విషయంలో ఆ సమస్యకు సులువుగానే పరిష్కారం లభించింది. ఈ రెండు సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
‘వీర సింహారెడ్డి’కి 20 రూపాయలు, ‘వాల్తేర్ వీరయ్య’కు 25 రూపాయల చొప్పున టిక్కెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి లభించగా, వీటిపై జీఎస్టీ పెంపు అదనంగా వుండనుంది. విడుదల తేదీ నుంచి కేవలం 10 రోజులు మాత్రమే ఈ పెరిగిన ధరలు అమలులో వుండనున్నాయ్.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









