‘వీరయ్య’ - ‘వీర సింహారెడ్డి’లకు టికెట్ల ధరలు పెంపు.!
- January 11, 2023
ఈ మధ్య టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, సినిమా రిలీజ్ డేట్లు, అప్డేట్లతో పాటూ, మా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచడం లేదహో.. అని కూడా డప్పు కొట్టి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి.
అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు పెద్ద సినిమాలు ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ల విషయంలో ఆ సమస్యకు సులువుగానే పరిష్కారం లభించింది. ఈ రెండు సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
‘వీర సింహారెడ్డి’కి 20 రూపాయలు, ‘వాల్తేర్ వీరయ్య’కు 25 రూపాయల చొప్పున టిక్కెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి లభించగా, వీటిపై జీఎస్టీ పెంపు అదనంగా వుండనుంది. విడుదల తేదీ నుంచి కేవలం 10 రోజులు మాత్రమే ఈ పెరిగిన ధరలు అమలులో వుండనున్నాయ్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







