‘వీరయ్య’ - ‘వీర సింహారెడ్డి’లకు టికెట్ల ధరలు పెంపు.!

- January 11, 2023 , by Maagulf
‘వీరయ్య’ - ‘వీర సింహారెడ్డి’లకు టికెట్ల ధరలు పెంపు.!

ఈ మధ్య టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, సినిమా రిలీజ్ డేట్లు, అప్‌డేట్లతో పాటూ, మా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచడం లేదహో.. అని కూడా డప్పు కొట్టి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి. 
అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు పెద్ద సినిమాలు ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ల విషయంలో ఆ సమస్యకు సులువుగానే పరిష్కారం లభించింది. ఈ రెండు సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 
‘వీర సింహారెడ్డి’కి 20 రూపాయలు, ‘వాల్తేర్ వీరయ్య’కు 25 రూపాయల చొప్పున టిక్కెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి లభించగా, వీటిపై జీఎస్‌టీ పెంపు అదనంగా వుండనుంది. విడుదల తేదీ నుంచి కేవలం 10 రోజులు మాత్రమే ఈ పెరిగిన ధరలు అమలులో వుండనున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com