రస్ అల్ ఖైమా నుంచి గ్లోబల్ విలేజ్కు బస్సు సర్వీస్ ప్రారంభం
- January 15, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా నివాసితులు పబ్లిక్ బస్సు ద్వారా నేరుగా దుబాయ్లోని ప్రముఖ ఫెస్టివల్ పార్క్ గ్లోబల్ విలేజ్కు చేరుకోవచ్చు. వన్-వే టిక్కెట్ ధర 30 దిర్హామ్ లుగా అధికారులు నిర్ణయించారు. నివాసితుల నుండి వచ్చిన డిమాండ్ మేరకు ఈ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు రాస్ అల్ ఖైమా ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RAKTA), దుబాయ్, గ్లోబల్ విలేజ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) లు సంయక్త ప్రకటనలో తెలిపారు. బస్సు సర్వీస్ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రెండు రౌండ్ట్రిప్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రస్ అల్ ఖైమా నుండి గ్లోబల్ విలేజ్కి మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి గ్లోబల్ పార్క్ నుండి తిరిగి ఎమిరేట్కి రాత్రి 10, 12 గంటలకు ప్రయాణం అవుతుంది. ప్రయాణీకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని RAKTA క్వాలిటీ అండ్ ఆపరేషన్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ హషేమ్ ఎస్మాయీల్ తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







