పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు
- January 15, 2023
మస్కట్: కోటలు, చారిత్రక ప్రదేశాలు, కేంద్రాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు ప్రవేశ రుసుములను వారసత్వ, సాంస్కృతిక శాఖ ఖరారు చేసింది. పురావస్తు ప్రదేశాలకు ప్రవేశ రుసుము 6-12 సంవత్సరాల వయస్సు గల ఒమానీలకు 200 బైసాలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 1గా నిర్ణయించారు. సుల్తానేట్ నివాసుల విషయానికొస్తే 6-12 సంవత్సరాల వయస్సు గల సందర్శకులకు టిక్కెట్ విలువ 500 బైసాలు, 12 ఏళ్లు పైబడిన వారికి OMR 1గా పేర్కొన్నారు. నాన్-రెసిడెంట్స్ విషయంలో 6-12 సంవత్సరాల వయస్సు వారికి OMR 1, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 3 గా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉన్న కోటలను ఈ నిర్ణయం నుండి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రవేశ రుసుముల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా సంస్థలు నిర్వహించే పాఠశాల పర్యటనలకు మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







