రాజగిరి పబ్లిక్ స్కూల్ 'ఎక్స్పో 2022' ప్రారంభం
- January 16, 2023
దోహా: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, స్ఫూర్తిని పెంపొందించేందుకు, యువ ఆవిష్కర్తలుగా మలిచే లక్ష్యంతో దోహాలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ (RPS) రాజగిరి ఎక్స్పో-2022 పేరిట సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దోహాలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఎక్స్పో వల్ల విద్యార్థులు కొత్త రంగాల్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు, తమలోని వనరులను వినియోగించుకునేందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని ఆనంద్ అన్నారు. అనంతరం విద్యార్థుల నమూనాలను పరిశీలించారు. ఇందులో 5వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 250 ఎగ్జిబిట్లను నాలుగు వర్కింగ్ మోడల్స్ గా విభజించి ప్రదర్శించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







