10,593 ఓరిగామి హంసలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ప్రవాస భారతీయురాలు
- January 16, 2023
యూఏఈ: ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేపర్ ఓరిగామి క్రాఫ్ట్ హంసలను రూపొందించిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ సభ్యురాలు, భారతీయ ప్రవాస భారతీయురాలు జమీలా నవాఘర్వాలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించింది. భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుట్టి పెరిగిన జమీలా 2019లో ముంబై నుండి దుబాయ్కి వచ్చి స్థిరపడ్డారు. అల్ ఖుసైస్-1లోని అమిటీ స్కూల్ దుబాయ్లోని 14 ఎకరాల అత్యాధునిక క్యాంపస్లో ఆమె 10,593 ఓరిగామి పేపర్ హంసలను తయారు చేసి రికార్డు సృష్టించారు. హంస కళారూపాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు. రికార్డు సాధనకు ఆమెకు ఇద్దరు ఒరిగామి నిపుణులు, 10 మంది వాలంటీర్లు తోడ్పాటు అందించారు. ఆమెకు బుర్హానుద్దీన్(8), ఇన్సియా(6) పిల్లలు ఉన్నారు. “ఈ రికార్డు సాధించేందుకు 10 నెలలకు పైగా శ్రమ పడ్డాను. ఏడేళ్ల క్రితం నా పెళ్లయిన తర్వాత దాదాపు 18 నెలల పాటు జపాన్లోని టోక్యోలో ఉన్నప్పుడు పేపర్ ఒరిగామి వర్క్ నేర్చుకున్నాను.” అని ఆమె తెలిపారు. ఓరిగామి అనేది గణితం, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభిన్న సబ్జెక్టులకు బేస్గా పనిచేసే ఒక కళ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







