10,593 ఓరిగామి హంసలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ప్రవాస భారతీయురాలు
- January 16, 2023
యూఏఈ: ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేపర్ ఓరిగామి క్రాఫ్ట్ హంసలను రూపొందించిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ సభ్యురాలు, భారతీయ ప్రవాస భారతీయురాలు జమీలా నవాఘర్వాలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించింది. భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుట్టి పెరిగిన జమీలా 2019లో ముంబై నుండి దుబాయ్కి వచ్చి స్థిరపడ్డారు. అల్ ఖుసైస్-1లోని అమిటీ స్కూల్ దుబాయ్లోని 14 ఎకరాల అత్యాధునిక క్యాంపస్లో ఆమె 10,593 ఓరిగామి పేపర్ హంసలను తయారు చేసి రికార్డు సృష్టించారు. హంస కళారూపాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు. రికార్డు సాధనకు ఆమెకు ఇద్దరు ఒరిగామి నిపుణులు, 10 మంది వాలంటీర్లు తోడ్పాటు అందించారు. ఆమెకు బుర్హానుద్దీన్(8), ఇన్సియా(6) పిల్లలు ఉన్నారు. “ఈ రికార్డు సాధించేందుకు 10 నెలలకు పైగా శ్రమ పడ్డాను. ఏడేళ్ల క్రితం నా పెళ్లయిన తర్వాత దాదాపు 18 నెలల పాటు జపాన్లోని టోక్యోలో ఉన్నప్పుడు పేపర్ ఒరిగామి వర్క్ నేర్చుకున్నాను.” అని ఆమె తెలిపారు. ఓరిగామి అనేది గణితం, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభిన్న సబ్జెక్టులకు బేస్గా పనిచేసే ఒక కళ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









