రష్మికకు ‘మిషన్ మజ్ను’ మరో ‘సీతారామం’ అవుతుందా.?
- January 18, 2023
ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ విశేషంగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధం కలిపిన ప్రేమ అనే ట్యాగ్తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు రష్మిక మండన్నా హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ ఈ నెల 20న రిలీజ్కి సిద్ధంగా వుంది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఆర్మీ అండ్ లవ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందిందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. దాంతో, ఈ సినిమా మరో ‘సీతారామం’ అవుతుందని అనుకుంటున్నారట.
ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. రష్మిక, సిద్దార్ధ్ జంట చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. అన్నట్లు రష్మిక సైన్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదేనట.
రిలీజ్ లేట్ అయిన కారణంగా అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘గుడ్ బై’ చిత్రం ముందుగా రిలీజైపోయింది. ఓటీటీలో రిలీజవుతుండడం వల్ల ఎక్కువ రీచ్ వుంటుంది. అది రష్మికకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







