కార్ల డీలర్షిప్ డాలర్లు సంపాదిస్తున్నా ఉగ్రవాదులు..
- April 29, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేపలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారట. కాస్తో కూస్తో కాదండోయ్ చేపల వ్యాపారంతో ఉగ్రవాదులు మిలియన్ల డాలర్ల డబ్బు కూడబెడుతున్నారు. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చమురు కేంద్రాలపై చాలా డబ్బు సంపాదించేవారు. అయితే ఇటీవల అమెరికా ఆధ్వర్యంలోని సేనలు చమురు కేంద్రాల లక్ష్యంగా వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల చమురుకేంద్రాలను ఉగ్రవాదుల ఆధీనం నుంచి సైన్యం లాగేసుకుంది. దీంతో వారు డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు చూసుకుంటున్నారు. చేపలు అమ్మడంతో పాటు కార్ల డీలర్షిప్లు, ఫ్యాక్టరీల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వందలాది సరస్సులు, చేపల చెరువుల్లోని చేపలు అమ్మి మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారు. చేపలు పెంచే వారి వద్ద నుంచి చెరువులు లాక్కుంటున్నారు. కొందరు యజమానులు చెరువులను వదిలేసి పారిపోగా, కొందరు చంపేస్తారేమోనని భయంతో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. 2007 నుంచే ఉగ్రవాదులకు చేపల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అందుతోంది. వీటితో పాటు ఉగ్రవాదులు కార్ల డీలర్షిప్ తీసుకుంటున్నారు. వారి ఆధీనంలో ఉన్న మౌసుల్ తదితర నగరాల్లో ప్రభుత్వ ఫ్యాక్టరీలను కూడా నడిపించి డబ్బు సంపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







