ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
- January 20, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కల్లు గీత కార్మిక కుటుంబాల కోసం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఈ పథకానికి సీఎం జగన్ శుక్రవారం ఆమోదం తెలిపారు.
ఈ పథకం ప్రకారం.. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్లు గీత కార్మికుడికి కూడా రూ.10 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అంచనా ప్రకారం.. 95,245 కల్లు గీత కుటుంబాలు కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 1,200 మంది కల్లు గీస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో 40 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మిగతావారు తీవ్ర గాయాలపాలవడం, శాశ్వత వికలాంగులుగా మారడం జరుగుతోంది. అందుకే ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజా పథకాన్ని రూపొందించింది. గత ప్రభుత్వ హయాంలో కల్లు గీత కార్మికులు మరణిస్తూ రూ.7 లక్షల పరిహారం అందేది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఇచ్చేది. మిగతా రూ.5 లక్షలు చంద్రన్న బీమా పథకం కింద చెల్లించేవాళ్లు. ఇప్పుడు ఈ మొత్తం రూ.10 లక్షలకు చేరింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు