చలికాలంలో చర్మం పొడిబారుతోందా.?
- January 20, 2023శీతాకాలం వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా వుంటుంది. అందుకే, చర్మం పొడిబారిపోతుంది. చలి గిలి ఎక్కువగా వున్న కారణంగా ఎక్కువగా నీరు త్రాగాలని అనిపించదు. తద్వారా శరీరంలో నీటి శాతం తక్కువయిపోయి డీ హైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయ్.
ఊరికే నీరసం రావడం, కండరాల నొప్పులు, రక్తపోటు, చికాకు, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి. దాహం వేయకపోయినా, తగినంత నీరు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా వుంటుంది. అందుకే, రకరకాల ఫ్లూ సంబంధిత వ్యాధుల బారిన సులువుగా పడుతుంటాం. చలికాలంలో నీరు తాగడం కష్టమే అయినప్పటికీ ఖచ్చితంగా తాగాల్సిన ఆవశ్యకత వుంది. కాబట్టి. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ఓ గ్లాసు వాటర్లో కొద్దిగా నిమ్మరసం.. అదేనండీ నిమ్మకాయ నీళ్లు తాగి చూడండి.
వివిధ రకాల పండ్ల రసాలను చిక్కగా కాకుండా కాస్తంత నీరు జోడించి గడ గడా తాగేయండి.
చలికాలంలో చెమట ఎక్కువగా పట్టని కారణంగా శరీరంలో ఉప్పు నిల్వలు ఎక్కువయిపోతాయ్. ఉప్పు శాతం పెరిగితే అధిక రక్తపోటు సమస్యలొస్తాయ్. అందుకే వీలైనంత తక్కువ ఉప్పు తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా వుండే, పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా వుండే కాఫీలూ, టీలూ తగ్గించాలి.హెర్బల్ టీలకు ప్రాధాన్యమిస్తే మంచిది. అలాగే, శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు వేడి వేడి ద్రవాలు తీసుకోవడం కూడా ఉత్తమం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్