గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు
- January 21, 2023
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతి రోజు ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది.ఈజిప్టు అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్తోనూ సమావేశం కానున్నారు. రిపబ్లిక్ డేకు పశ్చిమాసియా దేశాల నుంచి.. అరబ్ దేశాల నుంచి వస్తున్న ఐదో చీఫ్ గెస్టుగా అబ్దెల్ ఫతా నిలవనున్నారు.
కాగా, రిపబ్లిక్ డే పరేడ్లో ఈజిప్ట్ నుంచి వచ్చిన 180 మంది సభ్యులతో కూడిన బృందం కూడా పాల్గొననుంది. 75 ఏండ్ల భారత్ – ఈజిప్టు దౌత్య సంబంధాలకు గుర్తుగా పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై నేతలు సంతకాలు చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







