యూఏఈలో 4-రోజుల ఈద్ అల్ ఫితర్ సెలవులు
- January 23, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈలో వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. యూఏఈ నుండి భారతదేశం, పాకిస్తాన్, జీసీసీ, ఇతర మధ్యప్రాచ్య దేశాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. లాంగ్ వీకెండ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో ఈద్ అల్ ఫితర్ రోజుల్లో ఛార్జీల ధర 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు ఎంత ముందుగా సీట్లు బుక్ చేసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు. ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు ముందుగా సీట్లు బుక్ చేసుకోవడం ద్వారా మంచి మొత్తంలో ఆదా అవుతుందని తెలిపారు. ఈద్ అల్ ఫితర్కు వారం ముందు సీటు పొందడం యూఏఈ నుండి వచ్చే ప్రయాణికులకు సవాలుగా మారింది. భారత ఉపఖండం రూట్లలో కేరళ, లక్నో, ఢిల్లీ, ఢాకా, కొలంబో, కరాచీ, లాహోర్, ముంబైలకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉన్నదని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు. ముఖ్యంగా ఈద్ పండుగల సమయంలో దాదాపు అన్ని ముస్లిం దేశాలకు విమాన ఛార్జీలు పెరుగుతాయని అద్నానీ పేర్కొన్నారు. యూఏఈలో అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవులు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) అంటే ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







