యూఏఈలో 4-రోజుల ఈద్ అల్ ఫితర్ సెలవులు
- January 23, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈలో వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. యూఏఈ నుండి భారతదేశం, పాకిస్తాన్, జీసీసీ, ఇతర మధ్యప్రాచ్య దేశాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. లాంగ్ వీకెండ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో ఈద్ అల్ ఫితర్ రోజుల్లో ఛార్జీల ధర 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు ఎంత ముందుగా సీట్లు బుక్ చేసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు. ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు ముందుగా సీట్లు బుక్ చేసుకోవడం ద్వారా మంచి మొత్తంలో ఆదా అవుతుందని తెలిపారు. ఈద్ అల్ ఫితర్కు వారం ముందు సీటు పొందడం యూఏఈ నుండి వచ్చే ప్రయాణికులకు సవాలుగా మారింది. భారత ఉపఖండం రూట్లలో కేరళ, లక్నో, ఢిల్లీ, ఢాకా, కొలంబో, కరాచీ, లాహోర్, ముంబైలకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉన్నదని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు. ముఖ్యంగా ఈద్ పండుగల సమయంలో దాదాపు అన్ని ముస్లిం దేశాలకు విమాన ఛార్జీలు పెరుగుతాయని అద్నానీ పేర్కొన్నారు. యూఏఈలో అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవులు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) అంటే ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







