యూఏఈలో 4-రోజుల ఈద్ అల్ ఫితర్ సెలవులు
- January 23, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈలో వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. యూఏఈ నుండి భారతదేశం, పాకిస్తాన్, జీసీసీ, ఇతర మధ్యప్రాచ్య దేశాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. లాంగ్ వీకెండ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో ఈద్ అల్ ఫితర్ రోజుల్లో ఛార్జీల ధర 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు ఎంత ముందుగా సీట్లు బుక్ చేసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు. ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు ముందుగా సీట్లు బుక్ చేసుకోవడం ద్వారా మంచి మొత్తంలో ఆదా అవుతుందని తెలిపారు. ఈద్ అల్ ఫితర్కు వారం ముందు సీటు పొందడం యూఏఈ నుండి వచ్చే ప్రయాణికులకు సవాలుగా మారింది. భారత ఉపఖండం రూట్లలో కేరళ, లక్నో, ఢిల్లీ, ఢాకా, కొలంబో, కరాచీ, లాహోర్, ముంబైలకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉన్నదని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు. ముఖ్యంగా ఈద్ పండుగల సమయంలో దాదాపు అన్ని ముస్లిం దేశాలకు విమాన ఛార్జీలు పెరుగుతాయని అద్నానీ పేర్కొన్నారు. యూఏఈలో అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవులు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) అంటే ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









