అంతరిక్ష పరిశోధనలో ఒమన్కు సహాయం చేసేందుకు సిద్ధం: ఇస్రో
- January 23, 2023
బెంగళూరు : ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను కలిగి ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో ఒమన్కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 2018లో ఒమన్- భారతదేశం మధ్య అంతరిక్ష రంగంలో సహకారంపై ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. "రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్, గ్రహాల అన్వేషణ, అంతరిక్ష నౌకల వినియోగం, అంతరిక్ష-భూ వ్యవస్థల వినియోగంతో సహా అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో సహకారం కోసం ఒమన్ తో ఒప్పందం ఉంది" అని ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటరాజెన్సీ కోఆపరేషన్, ఇస్రో డైరెక్టర్ డాక్టర్ డి గౌరీశంకర్ తెలిపారు.
ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా ఒమన్ అంతరిక్ష పరిశోధనలో భాగంగా త్వరలో ఉపగ్రహాన్ని ప్రయోగించాలనే ఆశయంతో ఉంది. ఒమన్ ఇటీవలే నేషనల్ ఏరోస్పేస్ సర్వీసెస్ కంపెనీ (నాస్కామ్)తో తన స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ ఎట్లాక్ను బహుళ రాకెట్ ప్రయోగాల కోసం ఉపయోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్లాక్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ అనేది ఒక ప్రాజెక్ట్. ఇది భవిష్యత్తులో ప్రయోగాలకు ఉపయోగపడే సురక్షిత ప్రాంతంలో తమ ప్రోటోటైప్ హైబ్రిడ్-సాలిడ్ రాకెట్లను పరీక్షించే సదుపాయాన్ని కలిగి ఉండాలని కంపెనీ భావించినందున గత సంవత్సరం NASCOM ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









