భారతదేశంలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్ మాథ్యూ

- January 23, 2023 , by Maagulf
భారతదేశంలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్ మాథ్యూ

కువైట్: ప్రముఖ కమ్యూనిటీ సభ్యుడు, వ్యాపారవేత్త  జాన్ మాథ్యూ భారతదేశంలో మరణించారు. ఆయనకు 84 ఏళ్లు. దాదాపు 60 ఏళ్లుగా కువైట్‌లో ఉన్న ఆయన గత ఏడాది ఆగస్టులో కువైట్‌ను విడిచి భారతదేశానికి వెళ్లారు. జాన్ మాథ్యూ 60వ దశకంలో విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖలో చేరారు. అలాగే కువైట్‌లోని వివిధ సంస్థల బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. NRIల కోసం కేరళ ప్రభుత్వ నోర్కా(NORKA) ప్రాజెక్ట్‌కి అధికారిక ప్రతినిధిగా కూడా మాథ్యూ పనిచేశారు. గత సంవత్సరం కువైట్‌ను విడిచిపెట్టిన తరువాత, అతను కేరళలోని ఎర్నాకులంలో రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నాడు. జాన్ మాథ్యూకు భార్య రమణి, పిల్లలు అన్నా, సారా, మరియాలు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com