భారతదేశంలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్ మాథ్యూ
- January 23, 2023
కువైట్: ప్రముఖ కమ్యూనిటీ సభ్యుడు, వ్యాపారవేత్త జాన్ మాథ్యూ భారతదేశంలో మరణించారు. ఆయనకు 84 ఏళ్లు. దాదాపు 60 ఏళ్లుగా కువైట్లో ఉన్న ఆయన గత ఏడాది ఆగస్టులో కువైట్ను విడిచి భారతదేశానికి వెళ్లారు. జాన్ మాథ్యూ 60వ దశకంలో విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖలో చేరారు. అలాగే కువైట్లోని వివిధ సంస్థల బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. NRIల కోసం కేరళ ప్రభుత్వ నోర్కా(NORKA) ప్రాజెక్ట్కి అధికారిక ప్రతినిధిగా కూడా మాథ్యూ పనిచేశారు. గత సంవత్సరం కువైట్ను విడిచిపెట్టిన తరువాత, అతను కేరళలోని ఎర్నాకులంలో రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నాడు. జాన్ మాథ్యూకు భార్య రమణి, పిల్లలు అన్నా, సారా, మరియాలు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







