296 మంది ఎమిరాటీలను మోసం చేసిన ప్రైవేట్ సంస్థ యజమానికి జైలుశిక్ష
- January 25, 2023యూఏఈ: 296 ఎమిరాటీలను మోసం చేసినందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యజమాని, మేనేజర్కు జైలుశిక్ష విధిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నఫీస్ పథకంలో భాగంగా ట్రైనీలుగా చేరిన ఎమిరాటీస్ నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితులకు జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందుతులకు చెందిన సంస్థ ఎమిరాటీలకు శిక్షణ ఇవ్వడానికి నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకుంది. వారు ట్రైనీలను "దాతృత్వ ప్రయోజనాల కోసం" బ్యాంక్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని కోరారు. వారు నిరాకరించినట్లయితే శిక్షణ మూల్యాంకనంలో 'విఫలం' చేస్తామని సంస్థ ట్రైనీలను బెదిరించింది. నఫీస్ పథకం అనేది ఎమిరాటీస్ పోటీతత్వాన్ని పెంచడానికి, దేశంలోని ప్రైవేట్ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను పొందడానికి ఉద్దేశించినది. ప్రైవేట్ రంగ కంపెనీలు నఫీస్ ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకోవచ్చు. ఎమిరాటీ ఉద్యోగార్ధుల కోసం ఖాళీలు, శిక్షణను అందించవచ్చు. దీనికి గాను మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. గత సంవత్సరం ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు 20 సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు