హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్‌ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!

- January 25, 2023 , by Maagulf
హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్‌ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!

 కువైట్: హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్‌ కేసులో ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయుల సేవలను రద్దు చేయడంతోపాటు సర్వీస్ ముగింపు గ్రాట్యుటీలను తీసివేయాలని భావిస్తోంది. పరీక్షా పత్రాల లీక్‌పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో వారి ప్రమేయాన్ని నిర్ధారించడంతో విద్యాశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ అయిదురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com