రియాద్లో 4మీలియన్ల యాంఫేటమిన్ మాత్రలు స్వాధీనం
- January 26, 2023
రియాద్ : ఖతార్లోని తమ సహచరుల సహకారంతో రియాద్లో 4.091.250 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జీడీఎన్సీ) ప్రతినిధి ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్స్లోని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) కూడా తమకు సహకారం అందించిందన్నారు. యువత భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్వర్క్లకు దృష్టి సారించడంతో భారీ మొత్తంలో యాంఫేటమిన్ మాత్రల రాకెట్ బయట పడిందన్నారు. పశువుల దాణాలో యాంఫెటమైన్ మాత్రలు దాచి తరలిస్తున్న తమ తనిఖీలో గుర్తించినట్లు వివరించారు. రియాద్లో మాత్రల పార్సిళ్లను అందుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఒక ఈజిప్షియన్, మరొకరు జోర్డాన్ అని తేలిందన్నారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







