రియాద్లో 4మీలియన్ల యాంఫేటమిన్ మాత్రలు స్వాధీనం
- January 26, 2023
రియాద్ : ఖతార్లోని తమ సహచరుల సహకారంతో రియాద్లో 4.091.250 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జీడీఎన్సీ) ప్రతినిధి ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్స్లోని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) కూడా తమకు సహకారం అందించిందన్నారు. యువత భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్వర్క్లకు దృష్టి సారించడంతో భారీ మొత్తంలో యాంఫేటమిన్ మాత్రల రాకెట్ బయట పడిందన్నారు. పశువుల దాణాలో యాంఫెటమైన్ మాత్రలు దాచి తరలిస్తున్న తమ తనిఖీలో గుర్తించినట్లు వివరించారు. రియాద్లో మాత్రల పార్సిళ్లను అందుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఒక ఈజిప్షియన్, మరొకరు జోర్డాన్ అని తేలిందన్నారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







