కువైట్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
- January 27, 2023
కువైట్: భారతదేశ 74వ గణతంత్ర వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. భారత రాయబారి హెచ్ఈ ఆదర్శ్ స్వైక కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాలులర్పించారు. ఈ సందర్భంగా భారత్ – కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఆయన గుర్తు చేశారు. కువైట్లోని భారతీయులకు ఎంబసీ సహాయ సహకారాలు అందిస్తుందన్న ఆయన.. సహాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గుజరాతీ సమర్పన్, రైధున్ గ్రూప్, రిథమ్ స్కేప్, పంజాబీ బాంగ్రా గ్రూప్, బోహ్రా కమ్యూనిటీకి చెందిన ముహమ్మదీ స్కౌట్, కువైట్లోని స్కూల్ విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







