‘మెంటల్’ రచ్చ.! తగ్గేదేలే అంటోన్న బాలయ్య.!
- January 27, 2023అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అంటూ ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి, నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు చురకలు అంటించిన సంగతీ తెలిసిందే. సినీ రంగం నుంచే కాదు, రాజకీయంగానూ బాలయ్య వ్యాఖ్యలు హీట్ పెంచేశాయ్.
లెజెండరీ నటుల్ని అగౌరవపరిచేలా మాట్లాడతారా.? బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ పలు రకాలుగా బాలయ్యపై నెగిటివిటీ పోటెత్తింది. ఈ తరుణంలో బాలయ్య స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకెంతో అభిమానమనీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారనీ, తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవారనీ ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) అభిమానం లేదు.. ఇక్కడ వుంది.. అని వివాదాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లారు బాలయ్య.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి పెరుగుతోంది. బాలయ్య నోటికి అడ్డుకట్ట పడాలంటే, నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం పోతుందో.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14