‘మెంటల్’ రచ్చ.! తగ్గేదేలే అంటోన్న బాలయ్య.!
- January 27, 2023
అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అంటూ ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి, నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు చురకలు అంటించిన సంగతీ తెలిసిందే. సినీ రంగం నుంచే కాదు, రాజకీయంగానూ బాలయ్య వ్యాఖ్యలు హీట్ పెంచేశాయ్.
లెజెండరీ నటుల్ని అగౌరవపరిచేలా మాట్లాడతారా.? బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ పలు రకాలుగా బాలయ్యపై నెగిటివిటీ పోటెత్తింది. ఈ తరుణంలో బాలయ్య స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకెంతో అభిమానమనీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారనీ, తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవారనీ ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) అభిమానం లేదు.. ఇక్కడ వుంది.. అని వివాదాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లారు బాలయ్య.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి పెరుగుతోంది. బాలయ్య నోటికి అడ్డుకట్ట పడాలంటే, నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం పోతుందో.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







