‘మెంటల్’ రచ్చ.! తగ్గేదేలే అంటోన్న బాలయ్య.!
- January 27, 2023
అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అంటూ ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి, నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు చురకలు అంటించిన సంగతీ తెలిసిందే. సినీ రంగం నుంచే కాదు, రాజకీయంగానూ బాలయ్య వ్యాఖ్యలు హీట్ పెంచేశాయ్.
లెజెండరీ నటుల్ని అగౌరవపరిచేలా మాట్లాడతారా.? బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ పలు రకాలుగా బాలయ్యపై నెగిటివిటీ పోటెత్తింది. ఈ తరుణంలో బాలయ్య స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకెంతో అభిమానమనీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారనీ, తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవారనీ ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) అభిమానం లేదు.. ఇక్కడ వుంది.. అని వివాదాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లారు బాలయ్య.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి పెరుగుతోంది. బాలయ్య నోటికి అడ్డుకట్ట పడాలంటే, నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం పోతుందో.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







