పాక్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి

- January 28, 2023 , by Maagulf
పాక్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి

కరాచీ: పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని పేర్కొన్నారు.

వైద్య బృందం అక్కడకు చేరుకుందని మరణాలకు గల కారణాలపై పరిశోధిస్తుందని తెలిపారు. బహుశా సముంద్ర, నీటికి సంబంధించి ఈ వ్యాధి సోకినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధి సోకిన వారు గొంతులో వాపుతో పాటు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com