పాక్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి
- January 28, 2023
కరాచీ: పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని పేర్కొన్నారు.
వైద్య బృందం అక్కడకు చేరుకుందని మరణాలకు గల కారణాలపై పరిశోధిస్తుందని తెలిపారు. బహుశా సముంద్ర, నీటికి సంబంధించి ఈ వ్యాధి సోకినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధి సోకిన వారు గొంతులో వాపుతో పాటు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







