నారా లోకేష్ 'యువగళం'‌కు యూఏఈ టీడీపీ ఎన్నారైల సంఘీభావం

- January 29, 2023 , by Maagulf
నారా లోకేష్ \'యువగళం\'‌కు యూఏఈ టీడీపీ ఎన్నారైల సంఘీభావం

దుబాయ్: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా దుబాయ్ లో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ లోని రాజంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.

యూఏఈ తెలుగు దేశం శాఖ అధ్యక్షుడు యం.విశ్వేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం జి.సి.సి.సభ్యుడు ఖాదర్ బాషా, పార్టీ నాయకులు మజ్జీ శ్రీనివాస్, యన్.శ్రీనివాస్, వీరవల్లి వినాయక్, కాల సత్య, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com