సందీప్ కిషన్ ఈ టైమ్లో అలా అనేశాడేంటీ.?
- January 30, 2023
యంగ్ హీరో సందీప్ కిషన్కి కాలం కలిసి రావడం లేదు. మంచి టాలెంట్ వున్న హీరో. కానీ, కలిసొస్తేనే కదా నిలదొక్కుకునేది. అయినా కొత్త ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు సందీప్ కిషన్.
ఆ మధ్య ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఓ కొత్త ప్రయోగం చేశాడు ఒకింత ఫలించింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘మైఖేల్’ అనే సినిమాతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర ప్రముఖ తమిళ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. డబ్బింగ్ సినిమా.. స్ట్రెయిట్ సినిమా అనే బేధాలు మన తెలుగు సినిమాకి లేవు.. ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు మన తెలుగు వాళ్లు.
కానీ, తమిళోళ్లు అలా కాదు.. డబ్బింగ్ సినిమాని డబ్బింగ్ సినిమాలాగే చూస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సినిమా ఫలితంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది కదా.. ఈ టైమ్లో సందీప్ కిషన్ ఎందుకిలా కెలుక్కున్నాడంటూ నెటిజన్లు వాపోతున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









