సందీప్ కిషన్ ఈ టైమ్లో అలా అనేశాడేంటీ.?
- January 30, 2023యంగ్ హీరో సందీప్ కిషన్కి కాలం కలిసి రావడం లేదు. మంచి టాలెంట్ వున్న హీరో. కానీ, కలిసొస్తేనే కదా నిలదొక్కుకునేది. అయినా కొత్త ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు సందీప్ కిషన్.
ఆ మధ్య ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఓ కొత్త ప్రయోగం చేశాడు ఒకింత ఫలించింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘మైఖేల్’ అనే సినిమాతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర ప్రముఖ తమిళ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. డబ్బింగ్ సినిమా.. స్ట్రెయిట్ సినిమా అనే బేధాలు మన తెలుగు సినిమాకి లేవు.. ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు మన తెలుగు వాళ్లు.
కానీ, తమిళోళ్లు అలా కాదు.. డబ్బింగ్ సినిమాని డబ్బింగ్ సినిమాలాగే చూస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సినిమా ఫలితంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది కదా.. ఈ టైమ్లో సందీప్ కిషన్ ఎందుకిలా కెలుక్కున్నాడంటూ నెటిజన్లు వాపోతున్నారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు