ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- January 31, 2023మస్కట్: 2022లో ఒమన్ సుల్తానేట్లో నమోదైన అన్ని నేరాల్లో బౌన్స్ చెక్కులు అగ్రస్థానంలో ఉన్నాయని, మొత్తం 4518 కేసులు(14.9 శాతం) నమోదయ్యాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిస్ ఎక్సలెన్సీ నస్ర్ బిన్ ఖమీస్ అల్ సవాయ్ తెలిపారు. 2022లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డీల్ చేసిన కేసుల గణాంకాలను సమీక్షించే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్షిక సదస్సులో ఆయన వెల్లడించారు. గత సంవత్సరంలో ప్రజా హక్కుల కోసం సేకరించిన మొత్తం OMR 12.418 మిలియన్లు అని, గత సంవత్సరం జారీ చేసిన మొత్తం తీర్పుల సంఖ్య 15,442కి చేరుకుందని.. వాటిలో 90.2% అమలు చేయబడ్డాయని ఎక్స్ లెన్సీ వివరించారు. విచారణ సెషన్ల మధ్య విరామాలను తగ్గించే యంత్రాంగాన్ని ఆమోదించడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళికపై పని చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
2022లో 13 హత్యలు
2022లో జరిగిన హత్యల సంఖ్య 13కు చేరిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వార్షిక సదస్సులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సయీద్ అల్ షుకైలీ వెల్లడించారు. 2021లో కూడా ఈ సంఖ్య 13గానే ఉందని తెలిపారు. హత్యలను అధ్యయనం చేయడానికి, వాటి కారణాలను తెలుసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్థ అధికారంతో సమన్వయంతో పనిచేస్తుందని అల్-షుకైలీ తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్