టీ20 సిరీస్ కూడా భారత్ దే
- February 01, 2023
అహ్మదాబాద్: సొంత గడ్డ పై భారత జట్టు చెలరేగిపోతోంది. ఫార్మాట్ ఏదైనా.. విజయాల పరంపర మాత్రం కొనసాగిస్తోంది. తాజాగా టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
235 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 వికెట్లతో చెలరేగాడు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, శివమ్ మావి తలో రెండు వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ గిల్ మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
మరోవైపు భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు. మూడో టీ20లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన 23ఏళ్ల ఈ యువ సంచలనం.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదేశాడు. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఇతడే. అంతేకాదు టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా మారాడు శుభ్ మన్ గిల్.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!